తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. టైం స్లాట్, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 77,671 మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.