కోల్కతా: ఏపీ సీఎం చంద్రబాబుకు కోల్కతాలో ఘన స్వాగతం లభించింది. శనివారం కోల్కతాలో జరగనున్న భారీ ర్యాలీలో పాల్గొనడానికి చంద్రబాబు తన బృందంతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా కోల్కతా ఎయిర్ పోర్ట్లో చంద్రబాబుకు.. ఎంపీలు డెరిక్ ఒ బెరీన్, దినేష్ త్రివేది పుష్పగుచ్ఛం ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఇతర రాష్ట్రాల నుంచి ర్యాలీకి వచ్చిన ముఖ్య నేతలు, పార్టీల అధినేతలతో వరుస భేటీలవుతూ చంద్రబాబు బిజీబిజీగా గడుతపుతున్నారు.అస్సాం మాజీ సీఎం ప్రపూల్ కుమార్ మెహంతీతో సమావేశమైన చంద్రబాబు సుమారు అరగంట పాటు దేశ రాజకీయాలపై చర్చించారు.
శనివారం ర్యాలీ పూర్తయిన అనంతరం బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో.. చంద్రబాబు ఫ్రంట్, దేశ రాజకీయాల విషయమై చర్చించి అనంతరం మీడియాతో మాట్లాడతారని తెలుస్తోంది.