ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే?.. ప్రముఖ సెఫాలజిస్ట్ యోగేంద్ర యాదవ్ జోస్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 25, 2024, 08:29 PM

2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు.. ఈసారి అత్యంత ఆసక్తికరంగా మారాయి. పోలింగ్ ముగిసి 12 రోజులు గడిచిపోయినప్పటికీ.. పోలింగ్ సరళి ఇప్పటికీ ఎవరికీ అంతుబట్టడం లేదు. భారీగా నమోదైన పోలింగ్ శాతం తమకంటే తమకు అనుకూలమని.. అధికార, విపక్షాలు చెప్పుకుంటున్నాయి. పాజిటివ్ ఓట్లు అని వైసీపీ చెప్తుంటే.. ప్రజావ్యతిరేకతకు నిదర్శమని టీడీపీ కూటమి నేతలు చెప్తున్నారు. ఇదే సమయంలో ఎన్నికల వ్యూహకర్తలు సైతం ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేదానిపై తమ అంచనాలను మీడియాతో పంచుకుంటున్నారు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం ఖాయమని.. ఇప్పటికే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తేల్చేశారు.


2019 ఎన్నికల్లో 151 ఓట్లు సాధించిన వైసీపీ ఈసారి 50 సీట్లకు పరిమితమవుతుందంటూ పీకే ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో స్పష్టం చేశారు. తాజాగా ప్రముఖ సెఫాలజిస్ట్ ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటర్లు పట్టం కట్టారనే దానిపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్.. ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేదానిపై తన అంచనాను వెల్లడించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలోని 25 లోక్ సభ సీట్లలో 15 సీట్లను టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి గెలుచుకుంటుందని యోగేంద్ర యాదవ్ అంచనా వేశారు. ఏపీలో బీజేపీకి 3 ఎంపీ సీట్లు దక్కే అవకాశం ఉందని, టీడీపీ, జనసేనకు కలిపి 12 ఎంపీ సీట్లు వచ్చే ఛాన్స్ ఉందన్నారు.


కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం మూడోసారి ఏర్పాటు అవుతుందన్న యోగేంద్ర యాదవ్.. అయితే మిత్రపక్షాల సహకారం బీజేపీకి కావాల్సి వస్తుందని జోస్యం చెప్పారు. బీజేపీకి ఒంటరిగా 260కి మించి సీట్లు రావన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి ఎన్డీయే మిత్రపక్షాల అవసరం వస్తుందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధానంగా పోరు సాగుతుందని.. బీజేపీకి నాలుగు ఎంపీ సీట్లు దక్కే అవకాశం ఉందని యోగేంద్ర యాదవ్ చెప్పారు.


మరోవైపు 25 ఎంపీ సీట్లకు గానూ టీడీపీ 17 చోట్లా, బీజేపీ 6, జనసేన 2 చోట్లా పోటీచేశాయి. వైసీపీ సింగిల్‌గానే 25 స్థానాలలో అభ్యర్థులను బరిలో నిలిపింది. లోక్ సభ ఎంపీ సీట్ల విషయంలో తన అంచనాలను వెల్లడించిన యోగేంద్ర యాదవ్ .. ఏపీలోని అసెంబ్లీ సీట్లకు సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఏపీలో 25 ఎంపీ సీట్లలో కూటమికి 15 సీట్లు వస్తాయంటే.. వైసీపీకి 9 నుంచి 10 స్థానాలు దక్కే అవకాశం ఉంది. మరి ఈ రకంగా చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీగా పోరు సాగే ఛాన్సు ఉంది. అయితే ఎవరి అంచనాలు ఏమేరకు నిజమవుతాయనేదీ జూన్ నాలుగో తేదీన వెల్లడయ్యే ఫలితాలలో తేలనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com