ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల లగేజీ వదిలేసి వెళ్లిన విమానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 25, 2024, 08:23 PM

విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికులకు వింత అనుభవం ఎదురైంది. విమాన సంస్థ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం శనివారం ఉదయం గన్నవరం నుంచి బెంగళూరుకు బయల్దేరి వెళ్లింది. అయితే బెంగళూరుకు చేరుకున్న తర్వాత ప్రయాణికులకు చెందిన లగేజీ మిస్ అయినట్లు సిబ్బంది గుర్తించారు. మొత్తం 13 మంది ప్రయాణికులకు చెందిన లగేజీని గన్నవరం విమానాశ్రయంలోనే వదిలి వచ్చినట్లు గుర్తించారు.


గన్నవరం విమానాశ్రయం నుంచి బెంగళూరుకు టేకాఫ్ అయ్యే సమయంలో.. 13 మంది ప్రయాణికులకు చెందిన లగేజీని ఎయిర్ ఇండియా సిబ్బంది మర్చిపోయారు. అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా బెంగళూరుకు చేరుకున్న తర్వాత అసలు సంగతిని గుర్తించారు. అయితే పొరపాటును గ్రహించిన సిబ్బంది.. ప్రయాణికులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. లగేజీని మర్చిపోయామని, వచ్చేంత వరకూ వెయిట్ చేయాలంటూ 13 మంది ప్రయాణికులకు సూచించారు. అయితే ఎయిర్ ఇండియా సిబ్బంది నిర్లక్ష్యంపై ప్రయాణికులు మండిపడ్డారు. లగేజీ గురించి ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


 మరోవైపు ప్రయాణికులకు, ఎయిర్ ఇండియా సిబ్బందికి మధ్యన జరిగిన సంభాషణను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీంతో లగేజీ మర్చిపోయి ఎలా వెళ్లారా అయ్యా అంటూ నెటిజనం కామెంట్లు పెడుతున్నారు. అయితే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించే విషయంలో విమానయాన సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా కార్గో, బ్యాగేజ్ హ్యాండ్లింగ్ విధానంలో వారికి చిక్కులు వస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com