ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్ జగన్‌ జాతకంలోకి బుధ మహాదశ ఎంట్రీ.. అయితే ?.. వేణు స్వామి జోస్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 25, 2024, 08:00 PM

సినీ సెలబ్రిటీల దగ్గర నుంచి, రాజకీయాల వరకూ ట్రెండింగ్ అంశాల మీద జ్యోతిష్యం చెప్తూ ఫేమస్ అయిన ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి.. ఏపీ ఎన్నికల ఫలితాలపై మరోసారి తన అంచనాను వెల్లడించారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని.. వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారంటూ ఇప్పటికే పలుసార్లు వేణుస్వామి జోస్యం చెప్పారు. ఎన్నికలకు ముందు కూడా వేణుస్వామి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా మరో యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ వేణుస్వామి ఇదే విషయాన్ని చెప్పారు.


" 2019 ఎన్నికల తర్వాత రెండు, మూడేళ్లు వైఎస్ జగన్‌ జోలికి వెళ్లవద్దని టీడీపీకి చెప్పా. ఎన్నికలకు రెండేళ్ల ముందు వచ్చి వైఎస్ జగన్ పాలనపై మాట్లాడమని చెప్పా. కానీ టీడీపీ వాళ్లు మొదటిరోజు నుంచి జగన్ మీద విమర్శలకు దిగింది. జ్యోతిష్యం అనేది 88 శాతం కరెక్ట్ అయితే.. 12 శాతం స్వయంకృతాపరాధాలు పనిచేస్తాయి. టీడీపీ డ్యామేజ్ కావటానికి జాతకాల కంటే స్వయంకృతాపరాధమే పనిచేసింది, ఎన్నికలకు రెండు నెలల ముందు కూడా టీడీపీ గెలుస్తుందనే వైబ్ ఏపీలో ఉంది. కానీ కూటమి ప్రకటించాక.. మొత్తం టర్న్ తీసుకుంది" అని వేణుస్వామి చెప్పారు.


" ప్రస్తుతం వైసీపీ గెలుస్తుందని సర్వేలు చెప్తున్నాయి. కానీ వైఎస్ జగన్ గెలుస్తాడని నేను ఎప్పుడో చెప్పా. రెండేళ్ల కిందటే ఈ విషయం చెప్పా. నేను చెప్పిన వాటిలో వందలో 99 జరిగాయి. వైఎస్ జగన్ నాకేమీ చుట్టం కాదు. కానీ మరో 17 ఏళ్లు వైఎస్ జగన్‌ను కదిలించలేరు. నేను రోజుకో మాట చెప్పను. అలా చెప్పడానికి నేను పొలిటీషియన్ కాదు. వైఎస్ జగన్ జాతకంలోకి బుధ మహాదశ ప్రవేశించింది. మరో 17 ఏళ్లు ఆయనను కదిలించలేరు. అయితే 17 ఏళ్ల తర్వాత వైఎస్ జగన్‌కు కొన్ని సమస్యలు, గండాలు ఎదురు కావచ్చు. అయితే అప్పటి గురించి ఇప్పుడే చెప్పడం కరెక్ట్ కాదు" అని వేణు స్వామి చెప్పారు.


మరోవైపు వేణు స్వామి చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైసీపీ శ్రేణులు ఈ వీడియోను వైరల్ చేస్తున్నాయి. 17 ఏళ్లు అంటే 2029 ఎన్నికల్లోనూ వైసీపీదే విజయమంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే వేణు స్వామి జాతకం ఎంత వరకూ కరెక్ట్ అనేదీ జూన్ నాలుగో తేదీన వెల్లడయ్యే ఎన్నికల ఫలితాల్లో తేలనుంది. ఏపీలో మే 13వ తేదీన ఎన్నికలు జరగ్గా.. జూన్ 4వ తేదీ ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఫలితాలపై ప్రజలు, రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com