ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నార్పలలో పోలీసుల కార్డెన సెర్చ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 25, 2024, 07:01 PM

అనంతపురం జిల్లా, నార్పల మండలం నడిమిదొడ్డిలో పోలీసులు కార్డెన సెర్చ్‌ ఆపరేషన శుక్రవారం నిర్వహించారు. శింగనమల సీఐ శ్రీధర్‌, ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ట్రబుల్స్‌ మాంగర్స్‌, పాత కేసుల్లోని నిందితుల ఇళ్లల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. పశువుల పాకలు, వామిదొడ్లు, తదితర ప్రదేశాలను జల్లెడపట్టారు. రికార్డులు లేని రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కౌంటింగ్‌ రోజున, తరువాత ఎవరైనా గొడవలు, అల్లర్లకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com