యుపి : ప్రయాగ్ రాజ్లో నిర్వహిస్తున్న అర్థ కుంభ మేళాకు గురువారం భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పూజారులు రాష్ట్రపతితో పవిత్ర సంగమం తీరంలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం రాష్ట్రపతి గంగానదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. కోవింద్ వెంట యుపి సిఎం యోగితో పాటు గవర్నర్ రామ్నాయక్ కూడా ఉన్నారు.