గురువారం అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబును తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్, టీడీపీ నేత కడియాల బుచ్చిబాబులు కలిశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు తెలుగు యువత అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం సంతోషంగా ఉంది. యువత పార్టీ వైపు ఆకర్షితులు అయ్యేవిధంగా పని చేస్తా. ప్రభుత్వ కార్యక్రమాలు అన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తానని ఆయన అన్నారు.