ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ కనుమరుగయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 22, 2024, 12:21 PM

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని తెలుగుదేశం పార్టీ నేత, ఉండి టీడీపీ అభ్యర్థి రఘురామ కృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. ఈ నెల 13వ తేదీన వైసీపీకి ప్రజలు తిరస్కరించారని వివరించారు. ఒకవిధంగా ఆ పార్టీ 13వ తేదీన చనిపోయిందని తెలిపారు. జూన్ 4వ తేదీన సీఎం జగన్ దిమ్మదిరిగే ఫలితాలు రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఫలితాలు చూసి వైసీపీకి ఆ రోజు పెద్ద కర్మ నిర్వహించాల్సి ఉంటుందని సెటైర్లు వేశారు. జగన్‌కు రిటర్న్ గిప్ట్ ఉంటుంది.. ఆ విషయం తర్వాత చెబుతామని మీడియా ప్రతినిధులకు రఘురామ వివరించారు. గత ప్రభుత్వ హయాంలో తనకు నరకం చూపించారని రఘురామ వివరించారు. పుట్టి పెరిగిన ఊరు వచ్చేందుకు నాలుగేళ్ల సమయం పట్టిందని పేర్కొన్నారు. చివరికీ హైదరాబాద్‌లో అరెస్ట్ చేయించారని.. జగన్‌లో ఓ ఉన్మాది ఉన్నారని విమర్శించారు. ఉన్మాదికి అధికారం దక్కడంతో కొందరిని టార్గెట్ చేశారని రఘురామ వెల్లడించారు. తాను ఒక్కోడినే కాదు చాలామందిని జగన్ వేధించారు.. చివరికి అశోక గజపతిరాజు లాంటి సౌమ్యుడిని కూడా వదల్లేదని గుర్తుచేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com