చిలమత్తూరు మండలం వీరాపురం పంచాయతీ హుస్సేన్ పురంలో ఎన్నికల సందర్భంగా గొడవకు పాల్పడిన ఎంపీపీ పురుషోత్తం రెడ్డితో పాటు మరో 35 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గంగాధర్ గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ. ఎన్నికలు జరుగుతుండగా ఎంపీపీ తన అనుచరులతో కారులో పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చారు. టీడీపీ నాయకుడు బాబురెడ్డి ఎంపీపీల మధ్య ఘర్షణ జరిగి గొడవలకు దారితీసింది అన్నారు దీంతో 35 మంది పై కేసు నమోదు చేశారు.