అమరావతి: శాసనసభ కౌరవసభగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ ప్రతిపక్షనేత జగన్ ఆరోపించారు. శాసనసభ లాబీల్లో మీడియా ప్రతినిధులతో జరిపిన మాటామంతీలో జగన్ పలు విషయాలు పంచుకున్నారు. శాసనసభ జరిగిన తీరు కౌరవసభను తలపించిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటువేసేందుకు తాను కడపకు వెళ్లనున్నట్టు చెప్పారు. కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో దారుణమైన రాజకీయాలు జరుగుతున్నాయని జగన్ ఆవేదన వ్యక్తంచేశారు.