అమరావతి : పోలవరం పై మాట్లాడే నైతిక హక్కు వైస్సార్సీపీ నేతకు లేదని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ణాన్ని ధన యజ్ణంగా మార్చారని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. కమిషన్ల కోసం మట్టిపనులు చేసి డబ్బు దన్నుకున్నారని విమర్శించారు. ఈ రోజు ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించడంపై కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుదామంటే విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు.