కొండాపురంలోని శాంతినగర్ కాలనిలో వారాలతరబడి కుళాయిలకు తాగునీరు అందక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. గురువారం వారు మాట్లాడుతూ. అధికారులకు ప్రతిరోజు నీటి సమస్యపై అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదన్నారు. నీటి సమస్యను వెంటనే పరిష్కరించకుంటే సచివాలయం ముందు ఖాళీ బిందెలతో నిరాహార దీక్ష చేపడతామని అధికారులకు కాలనీ వాసులు హెచ్చరించారు.