మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అక్రమంగా హత్య కేసులో ఎమ్మెల్యే పేర్ని నాని ఇరికించాడని, అధికారంలోకి రాగానే వారిని వదిలే ప్రసక్తి లేదని చంద్రబాబు నాయుడు అన్నారు. నీతుల నాని ఇష్టారాజ్యంగా మచిలీపట్నంలో టీడీపీ కార్యకర్తలను వేధించాడన్నారు. రంగనాయక స్వామి దేవాలయం ఆస్తులను, దేవుడిని మింగేందుకు వైసీపీ నాయకులు చూస్తున్నారన్నారు. గంజాయి ప్రభుత్వం కావాలో అభివృద్ధి చేసే ప్రభుత్వం కావాలో బందరు ప్రజలు తెలుసుకోవాలన్నారు. సీఎం జగన్రెడ్డి ఎలా సైకోలా వ్యవహరిస్తున్నారో ఎమ్మెల్యే పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారన్నారు.