ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో మంగళవారం టిడిపి నాయకులు కార్యకర్తలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి కే ఓటు వేసి గెలిపించాలని స్థానిక ప్రజలకు నాయకులు కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంచారు. కార్యక్రమంలో స్థానిక కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.