గిరిజనులకు అన్ని విధాలా అండగా ఉన్నది జగనన్న ప్రభుత్వం అని ఎర్రగొండపాలెం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం ఎర్రగొండపాలెం మండలంలోని చెన్నుపల్లి, అంకమ్మ గూడెం, గంజివారిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ జగనన్న అందించిన సంక్షేమ పథకాలను గిరిజన కుటుంబాలకు వివరించారు. ఆయా గ్రామ నాయకులు పాల్గొన్నారు.