ఎన్టీఆర్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీడీపీని స్థాపిస్తే చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని రెండోసారి వెన్నుపోటు పొడిచారని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ బీజేపీ కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన మోడీ. ఏపీ సీఎంపై విరుచుపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు తెలుగు ప్రజల ఆరాధ్యదైవమైన ఎన్టీఆర్ కు రెండోసారి వెన్నుపోటు పొడిచారని మోడీ ఆరోపించారు. ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనమన్నారు. చంద్రబాబు తన పదవిని కాపాడుకోవటం కోసమే ఇలాంటి జిమ్మిక్కులు చేస్తారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజలకు చేసిన అవమానాన్ని ఎన్టీఆర్ ఎప్పటికి మరిచిపోరని స్పష్టం చేశారు. తెలుగు ప్రజలకు చేసిన ద్రోహాన్ని కూడా ఎన్టీఆర్ మరవరని మోడీ వెల్లడించారు.