ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులకు టీటీడీ షాక్.. పదవి నుంచి తొలగింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 26, 2024, 07:46 PM

తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుకు టీటీడీ షాకిచ్చింది. ఆయన్ను ఆ పదవి నుండి తొలగిస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్, టీటీడీ అధికారులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై బోర్డులో చర్చించామని.. తొలగించాలని బోర్డు ఏకగ్రీవంగా తీర్మానించినట్లు భూమన తెలిపారు. త్వరలోనే ఉత్తర్వులు జారీ అవుతాయన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రమణ దీక్షితులును తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించిన సంగతి తెలిసిందే.


గత టీడీపీ ప్రభుత్వంలో టీటీడీ అర్చకుల పదవీ విరమణ పై మే 16 2018లో పాలక మండలిలో.. పదవీ విరమణ వయస్సును నిర్ణయించి, అది దాటిన వారిని పదవీ విరమణ చేయవలసిందిగా ఉత్తర్వులను జారీ చేసింది. అప్పుడు రమణ దీక్షితులతో పాటు పలువురు అర్చకులు ఉద్యోగాలను కోల్పోయారు . అప్పుడు నలుగురు ప్రధాన అర్చకుల తో పాటు గా మరి కొంత మంది అర్చకులు పదవీ విరమణ చేశారు . ఆ తరువాతి కాలంలో కూడా అదే అనవాయితీ కొనసాగింది. అయితే 2018లో టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా అర్చకులు కోర్టును ఆశ్రయించారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న అర్చకులను వయసు మళ్లిన వారిని కూడా విధుల్లోకి తీసుకోవాలని కోర్టు తీర్పునిచ్చింది. అయితే వారు వయోభారం వల్ల స్వామి వారి కైంకర్యాలు చేయలేరనే ఉద్దేశంతో పాలకమండలి కోర్టు తీర్పును అమలు చేయలేదు.


వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక టీటీడీ పాలకమండలి ఆ అర్చకుల్ని తిరిగి విధుల్లోకి తీసుకుంది. హైకోర్టు తీర్పు మేరకు నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. టిటిడి నిర్ణయంతో గతంలో రిటైర్ అయిన రమణదీక్షితులు తిరిగి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు హోదాలో విధుల్లో చేరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com