ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారి మహిళా భక్తులకు గుడ్‌న్యూస్.. బంగారు మంగళ సూత్రాలపై క్లారిటీ, మరో కీలక నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 26, 2024, 07:35 PM

టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ధర్మప్రచారంలో భాగంగా బంగారు మంగళసూత్రాలను తయారుచేసి శ్రీవారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందిన తరువాత భక్తులకు విక్రయించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇవి 5 గ్రాములు, 10 గ్రాముల్లో ఉంటాయి.. వీటిని నాలుగు లేదా ఐదు డిజైన్లలో తయారు చేస్తారు. వీటితోపాటు లక్ష్మీకాసులను కూడా తయారు చేయాలని నిర్ణయించారు. వీటిని లాభాపేక్ష లేకుండా విక్ర‌యిస్తామని.. మ‌హిళ‌ల‌కు స్వామివారి కానుకగా టీటీడీ తెలిపింది.


అయితే తాజాగా టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ.4 కోట్లతో 4, 5, 10 గ్రాముల తాళి బొట్లు తయారు చేయాలని నిర్ణయించారు.. నాలుగు కంపెనీలకు టెండర్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు తిరుమల పెద్ద జీయర్‌స్వామి అనుమతి మేరకు.. తిరుమల శ్రీవారి ఆలయ ద్వారపాలకులు జయ విజయలకు బంగారు తాపడం చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. నడకదారిలో గాలిగోపురం, ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర నిత్య సంకీర్తన అర్చన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. తాళ్లపాక లో అన్నమయ్య కళామందిరం నిర్మాణానికి తీర్మానం చేశారు.


ఇటీవల నిర్వహించిన పీఠాధిపతులు సదస్సులో సూచనలకు పాలకమండలి ఆమోదం తెలిపింది.


* వడమాలపేట వద్ద టీటీడీ ఉద్యోగులకు కేటాయించే స్థలానికి రూ.8.16 కోట్లు


* తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి విద్యుత్ అలంకరణలకు ఆమోదం


* భక్తుల సౌకర్యార్థం శాశ్వత గోశాలకు బోర్డు మెంబర్ విరాళం


* ఎక్కవ సంఖ్యలో లడ్డు తయారికి సూపర్‌వైజర్ పోస్టుల కోసం ప్రభుత్వానికి లేఖ


* పాపవినాశనం వద్ద 682 మోటర్ పంపు సెట్లకు 3.18 కోట్లు ఆమోదం


* ఎంఏమ్ఎస్ సేవలు మూడు సంవత్సరాలు పొడిగింపు


* 1700 సంవత్సరాల చరిత్ర ఉన్న తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయానికి రూ.50 లక్షలు మంజూరు


* అలిపిరి , గాలిగోపురం నరసింహ స్వామి ఆలయం వద్ద ఉన్న ముగ్గు బావి ఆధునీకరణ


* ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంచాలని నిర్ణయం


* బాలబాలికల్లో భక్తి పెంపొందించడానికి 99 లక్షలు పుస్తాల ముద్రణకు


* స్విమ్స్‌లో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వారికి ఉచిత వైద్యం


* టీటీడీలో ఉన్న కాంట్రాక్టు, ఒఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు క్యాంటీన్‌లో రూ.10కే భోజనం


* తిరుమల్లోని అతిధి గృహాలు, యాత్రి సదన్ ఎఫ్ఎంఎస్ సేవలు 3సంవత్సరాలు పొడిగింపు..


* తిరుపతిలోని జీటీ ఆలయంలో శ్రీదేవి, భూదేవి ఉత్సవ నూతన బంగారు కవచాలు.


* రూ.15 లక్షలతో తండ్లకు బంగారు తాపడం.


* వెంకటశివ కృష్ణ ప్రసాద్ పదవి కాలం మూడు సంవత్సరాలు పెంపు.


* తాగునీటి అవసరాల కోసం ముగ్గు బావి ఆధునికరణ.


* జమ్మూలోని సిబ్బంది హెచ్‌ఆర్‌ఏ పెంపు..


* తిరుపతిలోని హరేరామ హరేకృష్ణా రోడ్డులో రూ.7.5 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం.


* రూ.3.72 కోట్లతో 98 లక్షల భగవద్గీత బుక్‌ల ప్రింటింగ్.


* స్విమ్స్‌లోని వివిధ విభాగాల్లో నగదు రహిత సేవలు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com