విజయవాడ, సూర్య బ్యూరో : రాష్ర్ట ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని, ప్రజా సమస్యల పరిష్కారాన్ని విస్మరించి కేవలం అభివృద్ధి మీదే దృష్టి సారించి విదేశీ కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు ఎర్ర తివాచీపరుస్తూ రాష్ర్టంలో రైతులు కనీస మద్దతు ధరలేక విలవిలలాడుతున్నా, అనేక జిల్లాల్లో పశువులకు కూడా మేత అందించే పరిస్థితులు లేక కరువు తాండివిస్తున్నా, రైతులు, రైతుల కూలీ లు ఇతర ప్రాంతాలకు వలసపోతున్నా రాష్ర్ట ప్రభుత్వం కనీస చర్యలు తీసుకో వట్లేదని జనసేన పార్టీ రాష్ర్ట కార్యకర్త పోతిన వెంకట మహేష్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ జనసేన పార్టీ కార్యకర్తలతో నిరసన కార్యక్ర మంలో ధర్నానుద్దేశించి పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ జనంలోంచి పుట్టినదే జనసేన పార్టీ అని, ప్రతి ప్రజా సమస్య గొంతుక అవుతూ, రాజకీ యాలలో మార్పు కోసం, నిబద్ధత కల నాయకత్వం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్న నిస్వార్థ ప్రజానాయకులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కి ప్రజల ఆకాంక్షల నుండి జనసేన పార్టీని స్థాపించి నందుకు 3వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ర్టంలో రైతులు కన్నీరు కారుస్తుంటే, రాష్ర్టం అభివద్ధిలో దూసుకుపోతుందనే అంకెల గారడీతో రాష్ర్టం మొత్తం విస్తుపోయిందన్నారు. అమరావతిలో లంక భూమి రైతుల సమస్యలు తీర్చి, బందరు పోర్టు విషయంలో కూడా అనవసరపు భూసేకరణ నుండి ప్రభుత్వ ప్రతిపాదనలను విరమించుకోవాలని డిమాండ్గ చేశారు. ఇసుక మాఫియాను కూడా ప్రభుత్వం అరికట్టలేకపోతున్నదని, పేదవారికి వైద్యాన్ని అందించే ప్రభుత్వ ఆసుపు్తల్రను ఆధునీకరించడములో నాణ్యమైన వైద్యము సకాలములో అందించడములో, సర్కారు నిర్లక్ష్యము చాలా స్పష్టముగా రాష్ర్ట ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. ప్రత్యేక హోదా అంశములో టిడిపి ఎందుకు వెనుకంజ వేసిందో, హోదా కోసం పోరాటం చేసే పవన్ కళ్యాణ్కి, ఇతర నాయకులకు మద్దతు ఇస్తే వారే ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి సాధించే వారని, రాష్ట్రాభివృద్ధికి సంజీవని అయిన హోదా విషయంలో ప్రజలను పక్క దారి పట్టించేలా తెలుగుదేశం పార్టీ ప్రకటనలు చేయడం రాష్ర్ట ప్రజల ఆశలపై నీళ్ళు చల్లిందన్నారు. ఆగ్రిగోల్డ ఏజెంట్లకు, ఖాతాదారులకు న్యాయం చేయడంలో ప్రభుత్వము పూర్తిగా విఫలమై యాజమాన్యానికి కొమ్ముకాస్తూ వందలాది మంది ఆత్మహత్యలకు కారణమవు తుందన్నారు. ఈ కార్యక్రమ ములో ఎన్.చందు, అమీర్భాషా, బి.వెంకటేష్, కె.హరీష్కుమార్, రజనీ తదితరులు పాల్గొన్నారు.