ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టంగుటూరికి నివాళులు అర్పించిన మంత్రి మేరుగ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 02, 2024, 06:16 PM

స్వాతంత్ర్య పోరాట యోధుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం  తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనం అని మంత్రి మేరుగ నాగార్జున కొనియాడారు. ప్రకాశం జిల్లా 55వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్ర‌వారం ఒంగోలు లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో స్వాతంత్ర్య సమర యోధుడు, మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు చిత్ర పటానికి రాష్ట్ర మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జున, జిల్లా అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి, మాదిగ కార్పోరేషన్ ఛైర్మన్, కందుకూరు నియోజకవర్గం పరిశీలకులు కొమ్మూరి కనకారావు తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రజల మనసులో చిరస్మరణీయంగా నిలిచిన ఆ మహనీయుని త్యాగం, సాహసం భావితరాలకు ఆదర్శం అని  పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com