న్యూఢిల్లీ : ఇవాళ రఫేల్ యుద్ధవిమానాల ఒప్పందంపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తునకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం నవంబర్ 14న తీర్పును వాయిదా వేసింది. వైమానిక దళ ఆధునికీకరణ కోసం ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ యుద్ధవిమానాలను కొనుగోలు చేయడానికి భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. రూ.58వేల కోట్ల విలువైన ఈ ఒప్పందంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి.