ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కృష్ణా జిల్లా పర్యటనకు బయల్దేరారు. కాసేపట్లో కోడూరు మండలం ఉల్లిపాలెంకు సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. ఉల్లిపాలెం-భవానీపురం వారధిని చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు. కృష్ణానదిపై రూ.77కోట్లతో ఉల్లిపాలెం-భవానీపురం వారధి నిర్మాణం చేపట్టనున్నారు. వంతెన నిర్మాణంతో దివసీమ ప్రజల కల నెరవేరనుంది. వారధి వద్ద 27 అడుగుల తెలుగుతల్లి విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించనున్నారు.