పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురంలో రేషన్ బియ్యం పట్టుబడింది. లారీలో అక్రమంగా తరలిస్తున్న 16 టన్నుల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా నుంచి రేషన్ బియ్యాన్ని తూర్పు గోదావరి ద్రాక్షారామం తరలిస్తుండగా ద్వారకా తిరుమల మండలం తిమ్మాపురంలో విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.