కాకినాడ: ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం ఏర్పడిన పార్టీ జనసేన పార్టీ అన్నారు పవన్ కళ్యాణ్. కాకినాడ కల్పనా సెంటరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతున్న ఆయన అప్పట్లో ఎన్టీఆర్ ప్రత్యేక పరిస్థితుల్లో పార్టీ పెట్టారని.. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాకోసం గళమెత్తింది కాకినాడ నుండే అన్న పవన్ ప్రత్యేక పరిస్థితుల మధ్య పార్టీ పుట్టిందన్నారు. అవినీతిలేని పాలన కావాలని చంద్రబాబును కోరామన్న అయన రాష్ట్రంలో ఎక్కడ చూసినా కనీస వసతులు కూడా లేవన్నారు. ప్రజల తరపున పోరాడే నాయకులూ ఉన్నారని చెప్పటం కోసమే ఇలా వచ్చామన్న అయన అవినీతి అంతమయ్యేవరకు పోరాటం కొనసాగుతుందన్నారు.