న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన కారు ప్రమాదంలో ఓ మహిళ(38) మృతిచెందింది. ఆమె కూతురు తీవ్రంగా గాయపడి చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళ తన భర్త, కూతురుతో కలిసి కారులో ఛతేపూర్ మందిర్కు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్నారు. ఇదే సమయంలో మహిళ డ్రైవ్ చేస్తున్న ఎస్యూవీ కారు కంట్రోల్ తప్పి డివైడర్ ఢీకొట్టి రోడ్డు దాటి వీరు ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. కారు డ్రైవ్ చేసిన మహిళ తాగి ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు.