మంత్రి పదవి విషయంలో నాకు ఎలాంటి అసంతృప్తి లేదని టీడీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు. మైనార్టీ కోటలో గత విస్తరణలోనే తన పేరు చివరి నిమిషం వరకూ పరిశీలించారన్నారు. కొన్ని రాజకీయ సమీకరణాల్లో భాగంగానే నాకు మంత్రి పదవి దక్కలేదన్నారు. నేను మధ్యలో పార్టీనా.. ప్రతిపక్షంలోనూ తెదేపాకు అండగా ఉన్నానన్నారు. చంద్రబాబు నాకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు.