హంగరి: హంగరి గగనతలంలో ఏటీసీతో ఎయిరిండియా విమాన సంబంధాలు తెగిపోయాయి. ఎయిరిండియా విమాన రక్షణ కోసం హంగరి యుద్ధ విమానాన్ని పంపింది. ఎట్టకేలకు ఎయిరిండియా విమానం లండన్లో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు అధికారులు ప్రకటించారు. విమానంలో ఉన్న 231 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ఎయిరిండియా విమానం అహ్మదాబాద్ నుంచి బ్రిటన్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఫ్రీక్వెన్సీలో సాంకేతిక లోపం కారణంగా ఏటీసీతో సంబంధాలు తెగిపోయినట్లు అధికారులు వెల్లడించారు.