శ్రీకాకుళం : ఆర్ అండ్ బి అతిథి గృహంలో శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ ను ప్రభుత్వ విప్ కూన రవికుమార్, జిల్లా కలెక్టర్ కె.ధనుంజయరెడ్డి, జేసీ కె.వి.ఎన్.చక్రధరబాబు మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం స్పీకర్ కోడెల తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించుటకు బయల్దేరారు. శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట, పలాస, వజ్రపు కొత్తూరు మండలాల్లో స్పీకర్ పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు.