వైసిపి అధినేత జగన్, జనసేనాని పవన్ కళ్యాణ్ పై ఘాటుగా స్పందించారు మంత్రి నారా లోకేష్. విజయవాడలో మాట్లాడిన ఆయన అనేక కేసులున్న జగన్, శ్రీకాకుళంలో మరొకరు తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆరోపణలు చేస్తున్న నేతలు దమ్ముంటే నిరూపించాలని డిమాండ్ చేశారు. అర్ధం పర్థం లేని ఆరోపణలు చేయడమే కాదు, వాటిని నిరూపించాల్సిన బాధ్యత కూడా ఆ నేతలపైనే ఉందన్నారాయన.
తిత్లీ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు లోకేష్. 35 మంది ఐఏఎస్ అధికారులు, 200 మంది డిప్యూటీ కలెక్టర్లు బాధితుల కోసం అహర్నిశలు పని చేస్తుంటే, శ్రీకాకుళం జిల్లా పక్క జిల్లాలోనే పర్యటిస్తున్న జగన్ ఇక్కడకు మాత్రం రాలేదని విమర్శించారు. తుఫాన్ తర్వాత ఏడు రోజులకు పరామర్శకు వచ్చిన పవన్ కళ్యాణ్, సిఎం చంద్రబాబుపై విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు.
జగన్, పవన్ లు వచ్చి వెళ్లి పోతారని, సాయం చేసేది చంద్రబాబే అని అక్కడ ప్రజలకి తెలుసున్నారు మంత్రి లోకేష్ .