విజయవాడలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నారా లోకేశ్ పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, ఎంపీలు సుజనా చౌదరి, కొనకళ్ల, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోడె ప్రసాద్, బొండా ఉమ, వంశీమోహన్, ఎమ్మెల్సీలు బుద్ధా వెంకన్న, టీడీ జనార్ధన్, బచ్చుల అర్జునుడులు పాల్గొన్నారు. ఆటోనగర్లోని ఎకరం స్థలంలో టీడీపీ జిల్లా కార్యాలయం నిర్మిస్తున్నారు.