శ్రీకాకుళం తిత్లీ తుఫాన్ ప్రభావ ప్రాంతాలలో మంత్రి నారాయణ పారిశుధ్య పనులను పర్యవేక్షిస్తున్నారు. పలాస, ఇచ్ఛాపురం మండలాలలో స్థానిక అధికారులు, నాయకులుతో కలిసి మంత్రి పారిశుధ్య పనులను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాటర్ ట్యాంకర్లు, స్వీపింగ్ మిషన్లు తెప్పించామని, అప్పటి నుండి నిరంతరాయంగా నీటిని అందిస్తూ, పారిశుధ్య పనులు వేగవంతంగా చేస్తున్నామన్నారు మంత్రి. అక్షయపాత్ర ఫౌండషన్, మెప్మా సహాయంతో ఆహారాన్ని అందిస్తున్నామని.. పలాసలో పదివేలమందికి, ఇచ్ఛాపురంలో ఎనిమిదివేల మందికి మూడు పూటలా ఆహారాన్ని అందిస్తున్నామన్నారు.