బెంగళూరు : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడిక్కడ హిందుస్తాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్) సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో హెచ్ఎఎల్లో పదవీ విరమణ చేసిన ఉద్యోగులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంలో కేంద్రం హెచ్ఎఎల్ను తప్పించి అనిల్ అంబానీ కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టిందని, దీనిలో వేల కోట్ల రూపాయిల కుంభకోణం జరిగిందని రాహుల్ ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హెచ్ఎఎల్ ఉద్యోగులతో రాహుల్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.