ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలతో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందన్నది ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్న నేపథ్యంలో యూపీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ నాయకుడు అఖిలేష్ యాదవ్ బీజేపీని అధికారానికి దూరంగా ఉంచేందుకు అవసరమైతే మాయావతితో పొత్తుకు సిద్ధమని ప్రకటించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలలో సమాజ్ వాదీ పార్టీ,కాంగ్రెస్ లు కలిసి పని చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కూటమి, మాయావతి నేతృత్వంలోని బీఎస్పీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు తెరవెనుక ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయని అఖిలేష్ ప్రకటనతో తేటతెల్లమౌతున్నది.