న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వైద్య పరీక్షలు, చికిత్స నిమిత్తం విదేశాలకు వెళ్లారు. ఆమె నిన్ననే బయలు దేరి వెళ్లారని కాంగ్రెస్ పార్టీలోని అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆమె 22న స్వదేశానికి తిరిగి వస్తారని, అంత వరకూ పార్టీ వ్యవహారాలన్నీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చూస్తారని ఆ వర్గాలు తెలిపాయి.