గుంటూరు : డ్వాక్రా మహిళలకు రూ.2514కోట్లు వడ్డీ రాయితీ కింద ఇచ్చామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గుంటూరులో మండల సమాఖ్య నాయకులు, వెలుగు సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈసందర్భంగా మంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ… మూడు విడతల్లో ఒక్కొక్కరికి రూ.8వేల చొప్పున రూ.6833కోట్లు ఇచ్చామన్నారు. మిగతా రూ.2వేలు దసరా కానుకగా అందజేస్తామన్నారు. చంద్రన్న పసుపు – కుంకుమను సద్వినియోగం చేసుకోవాలన్నారు.