న్యూఢిల్లి : మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసిఐ) బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ఎంసిఐ బోర్డు ఆఫ్ గవర్నర్స్ పేర్లను వివరించారు. డాక్టర్ వికె పాల్, డాక్టర్ రణదీప్ గులేరియా, డాక్టర్ జగత్ రామ్, డాక్టర్ బిఎం గంగాధర్, డాక్టర్ నిఖిల్ టాండన్, డాక్టర్ ఎస్ వెంకటేశ్, డాక్టర్ బలరామ్ భార్గవ ఎంసిఐ బోర్డు ఆఫ్ గవర్నర్స్గా వ్యవహరిస్తారని జైట్లీ చెప్పారు.