అనంతపురం జిల్లా కణేకల్లు మండలం 43 ఉడేగోళం, బ్రహ్మసముద్రం, బేణేకల్లు గ్రామాల్లో మంత్రి కాలువ శ్రీనివాసులు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక రైతులతో మాట్లాడారు. సాగునీరు ఏ విధంగా సరఫరా అవుతుందో రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది సాగునీటి ఇబ్బందులు రాలేదని రైతులు మంత్రితో అన్నారు. ఉడేగోళం గ్రామంలో ఈశ్వర మాన్యం సాగునీరు లేక రెండేళ్లుగా బీడుగా ఉండేది. ఈసారి హెచ్ఎల్సీనీరు ముందుగా రావడంతో సాగుచేస్తున్నాం అని రైతులు మంత్రికి రైతులు తెలిపారు.