ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారు. 2010 నాటి బాబ్లీ ప్రాజెక్ట్ సందర్శన కేసులో తాజాగా అరెస్ట్ వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే. ధర్మాబాద్ కోర్టుకు వెళ్లాలా వద్దా అన్న అంశం మీద సంప్రదింపులు జరుపుతున్నారు. సోమవారం పార్టీ ముఖ్యనేతలతో సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకోనున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.