పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. శనివారం (సెప్టెంబరు 15) కూడా ఇంధన ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. దీంతో ఢిల్లీలో 35 పైసలు పెరిగిన పెట్రోలు ధర రూ.81.63కి చేరింది. మరోవైపు డీజిల్ ధర 24 పైసలు పెరిగి రూ. 73.54కి చేరింది. ముంబయిలో 34 పైసలు పెరిగిన పెట్రోలు ధర రూ.90కి కేవలం 99 పైసల దూరంలో నిలిచింది. డీజిల్ ధర 25 పైసలు పెరిగి రూ.78.07కు చేరింది. సెప్టెంబరు 5, సెప్టెంబరు 12 మినహా గత కొన్ని వారాలుగా ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి . ఆగస్టు మధ్య నుంచి ఇప్పటి వరకు లీటర్ పెట్రోల్పై రూ. 4.83, డీజిల్పై రూ.5 పెరిగింది.