తాడేపల్లిగూడెం టౌన్ మేజర్న్యూస్: ప్రతి సంవత్సరం రాష్ట్రంలో 1.30వేల దళిత,గిరిజన భక్తులకు దివ్యదర్శనం కార్యక్రమం రాష్ట్రంలో ప్రముఖ క్షేత్రా లను దర్శించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. బుధవారం తాడేపల్లి గూడెంలో ఆర్టిసి బస్స్టాప్ వద్దగల శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం నుండి జేండా ఊపి స్సును ప్రారంబించారు.ఈ సందర్బంగా మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మదాయ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దివ్యదర్శనం కార్యక్రమాన్ని పేద,మద్యతరగతి దళిత,గిరిజన భక్తులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పేద మద్యతరగతి దళిత,గిరిజన భక్తులను దృష్టిలో వుంచుకుని రాష్ట్రంలో 8 క్షేత్రాలను దర్శించుకునే విధంగా కార్యక్రమాన్ని రూపోందించుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో 10వేల మందికి దివ్యదర్శనం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు.బస్సు ప్రయాణం, ఉపహరం, భోజన వసతి, దర్శనం, ప్రసాదాలు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వమే సమకూరు స్తుందన్నారు. విజయవాడ శ్రీకనకదుర్గ, జోన్నవాడ, శ్రీకాలహస్తి, కానిపాక్కం, తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, శ్రీశైలం భ్రమరాంబిక సమేత మల్లికార్జునస్వామి, అహోబిలం శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవాలయం, త్రిపురాంతకంలో శ్రీ క్షేత్రాలను భక్తులు దర్శించుకునే విధంగా 3 నుండి 4 రోజుల ప్రయాణ సమయం ఏర్పాటుచేయ్యడం జరిగిందని అన్నారు.ప్రతి ఓక్క భక్తుడు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి దివ్యదర్శనం దర్శించు కోవాడానికి వీలుగా ఏర్పాటుచేయడం జరిగిందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొవాలని మంత్రి మాణిక్యాలరావు అన్నారు. ఈ కార్యక్రమంలో బిజేసి నాయకులు యోగ్గిన నాగబాబు,కౌన్సిలర్లు పట్నాల రాంపండు, కోట రాంబాబు, గురుజు సూరిబాబు, తదితరులు పాలోన్నారు.