విజయవాడ: దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెంపునకు నిరసనగా ఏఐసిసి అదేశాల మేరకు ఏపిసిసి ఈ నెల 10న బంద్ ను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ ఇక్కడ ధరలను తగ్గించకుండా సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం మోపుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 10న భారత్ బంద్ చేపట్టాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. ప్రజల పక్షాన జరుగుతున్న ఈ ఆందోళనలో రాజకీయ పార్టీలు కూడా పాల్గొనాలని కోరుతు ఉత్తరాలు రాసిన్నట్లు తెలిపారు. కలిసివచ్చే అన్ని రాజకీయ పక్షాలతో కలిసి ఈ ఆందోళనను ఆంధ్రప్రదేశ్ లో చేపట్టాలని ఏపీసీసీ భావిస్తున్నదన్నారు. ఇప్పటికే ప్రధాన అన్నిపార్టీలకు ఏపీసిసి లేఖలు రాసిందని చెప్పారు.