ముంబై: శివసేన కార్పొరేటర్ విశ్వనాథ్ మహదేశ్వర్ ముంబై నూతన మేయర్గా ఎన్నికయ్యారు. ఇవాళ కార్పొరేటర్ల సమావేశంలో ఆయనను మేయర్గా ఎన్నుకున్నారు. దాదాపు 227 మంది కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు మేయర్ను ఎన్నుకున్నారు. మధ్యాహ్నం జరిగిన జనరల్ బాడీ మీటింగ్లో బీజేపీ కార్పొరేటర్లు కూడా మద్దతు ప్రకటించారు. విశ్వనాథ్ ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగుతారు. ఇక డిప్యూటీ మేయర్గా హేమగిరి వార్లికర్ ఎంపికయ్యారు.