స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించారు. దేశ ప్రజలకు ఆయన స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో ప్రాణాలు అర్పించారన్నారు. దేశ అభివృద్ధి కోసం అందరం కలిసి కట్టుగా శ్రమించాలన్నారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. పేదరికం నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. మహిళలకు పురుషులతో సమానంగా అవకాశాలు కల్పించాలన్నారు. ఎందరో త్యాగధనుల ఆశయ ఫలమే మన స్వాతంత్ర్యం అన్నారు. 72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆల్ ఇండియా రేడియో ద్వారా ఆయన తన సందేశం వినిపించారు. రాష్ట్రపతికి ఇది రెండో స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం. మనం పేదరికం నుంచి స్వాతంత్ర్యం సాధించాలన్నారు. రైతులు, పోలీసులు, సైనికులు, ప్రజలు తమ తమ రంగాల్లో విశేష కృషి చేస్తున్నారని కితాబిచ్చారు.