అమరావతి నుంచి సూర్య ప్రత్యేక ప్రితనిధి : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ఖాన్ అసెంబ్లీ ప్రాంగణంలో సందడి చేశారు. తనకు ఎదురైన వైకాపా ఎమ్మెల్యే ముస్తాఫాను టీడీపీలోకి ఎప్పుడొ స్తావని అడిగారు. వెకాపాలోనే ఉంటే రోజాలాగే ఇబ్బంది పడతావని చమత్కరించారు. తన నియోజకవర్గానికి చంద్రబాబు రూ.300కోట్ల నిధులు ఇచ్చారని తెలిపారు. తన నియోజక వర్గంలో పవన్కల్యాణ్ పోటీ చేసినా కనీసం పది ఓట్ల మెజార్టీతోనైనా తాను గెలుస్తానని దీమా వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో బలం లేకపోయినా వైకాపా అధికారంలోకి రావాలని కలలు కంటోందని అన్నారు. రాజధాని రైతులు సంతోషంగా ఉన్నారని తాను వైకాపాలో ఉన్నప్పుడు జగన్కు చెప్పినా ఆయన వినలేదని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా మరో ముగ్గురు ఎమ్మె ల్యేలు టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని జలీల్ఖాన్ తెలిపారు.