మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో బాలసంజీవని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులు, బాలింతలు, గర్భిణుల ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు గారు ప్రత్యేక దృష్టిపెట్టారని, వారికి పోషకాహార లోపం లేకుండా పౌష్టికాహారాన్ని అందించేందుకు బాల సంజీవని కార్యక్రమం చేపట్టారని తెలిపారు. బాలింతలు, గర్భిణీలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బాలసంజీవని ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.