విజయవాడ : మున్నేరు పరీవాహక ప్రాంతాల నుంచి శనివారం ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరింది. తెలంగాణలోని మధిర, మున్నేరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో చేరిన వరదనీటి కారణంగా ప్రకాశం బ్యారేజీ నుంచి 11 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశామని అధికారులు తెలిపారు. ఈ రోజు సాయంత్రం మరో 5 వేల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేస్తామన్నారు. కృష్ణా డెల్టా చీప్ ఇంజినీర్ మాట్లాడుతూ.. వరద ఉధృతితో పట్టి సీమ పంపులు నిలిపేశామన్నారు. కృష్ణా జిల్లాలో చివరి భూములకు నీరివ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు.