శ్రీనగర్ : జమ్ము కాశ్మీర్లోని దోడాలో ఒక పాఠశాలలో తక్కువస్థాయి కలిగినే పేలుడు సంభవించింది. ఈ పేలుడులో పాఠశాల ప్రిన్సిపాల్, మరొక ఉద్యోగికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు అక్కడికి చేరుకుని పేలుడుకు కారణమైన పదార్థాలను పరీక్షిస్తున్నారు.