అమరావతి : కేంద్ర ప్రభుత్వంపై టిడిపి, ఇతర ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో తమ పార్టీ ఎంపి గల్లా జయదేవ్ చేసిన ప్రసంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. లోక్సభలో చర్చను చంద్రబాబు నాయుడు తన కార్యాలయంలో కూర్చుని చూస్తున్నారు. అమరావతినుంచి ఢిల్లిలోని తమ పార్టీ ఎంపిలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని దేశం దృష్టికి తీసుకువచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై చర్చలో వాస్తవాలను అంకెలతో సహా లోక్సభలో తెలిపారని ఆయన అన్నారు. ఇదొక అద్భుత అవకాశం, చారిత్రాత్మక సందర్భం అని ఆయన చెప్పారు.