ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్‌ను ఎన్డీయేలోకి ఆహ్వానిస్తున్నాం: కేంద్రమంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 14, 2018, 02:17 PM

ఎన్డీయే నుంచి తెదేపా వైదొలగడంపై కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే నుంచి వైదొలిగే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తొందరపాటుగా వ్యవహరించారని, కొనసాగి ఉంటే హోదాపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించేవారని అన్నారు. జగన్‌ను తాము ఎన్డీయేలోకి ఆహ్వానిస్తున్నామని, తమతో కలిస్తే ఆయన సీఎం అయ్యేందుకు సహకరిస్తామని తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో మోదీ, అమిత్‌షాలతో తాను మాట్లాడతానని చెప్పారు. హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా అథవాలే ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రాహుల్‌పై వ్యంగ్యస్త్రాలు సంధించారు. రాజ్యాంగాన్ని తానూ, మోదీ రక్షిస్తామని.. కాంగ్రెస్‌ పార్టీని ఆయన రక్షించుకోవాలని సలహా ఇచ్చారు. ఇక ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధ కట్టం కొంతమేర దుర్వినియోగం అవుతున్న మాట వాస్తవమే అయినా..ఇప్పటికీ పలు చోట్ల దళితులు వేధింపులను ఎదుర్కొంటున్నట్టు అభిప్రాయపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com